TRINETHRAM NEWS

తెలుగుదేశం పార్టీ నుంచి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ లోకి 200 కుటుంబాల చేరిక

వినుకొండ నియోజకవర్గంలోని వినుకొండ రూరల్ మండలం కొప్పుకొండ గ్రామ పంచాయతీ పరిధిలోని పలు గ్రామాల తెలుగుదేశం పార్టీ నుండి 200 కుటుంబాలు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ లోకి చేరగా వారికి వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు..

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ లో ఉండి వారికీ ఎలాంటి అభివృద్ధి చెందలేదని, గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ద్వారా అభివృద్ధి చూసి, మరియు వినుకొండ నియోజకవర్గ లో జరుగుతున్న అభివృద్ధి, అందిస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఈ రోజు సుమారు 200 కుటుంబాలు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ లోకి చేయటం సంతోషకరంమని అన్నారు.

ఈ కార్యక్రమంలో మండల స్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు…