TRINETHRAM NEWS

నూతన సంవత్సర శుభాకాంక్షలతో ఇస్రో కొత్తగా కీలక ప్రయోగం

న్యూ ఇయర్ రోజున ఇస్రో కీలక ప్రయోగానికి శ్రీకారం చుట్టనుంది. PSLV వాహన నౌక ద్వారా మన దేశానికి చెందిన ఎక్స్ పోశాట్ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి పంపనుంది.

ఈ ప్రయోగాన్ని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి జనవరి 1వ తేదీన ఉదయం 9.10 గంటలకు చేపడతారు. ఇది దేశానికి చెందిన మొట్టమొదటి పోలారిమెట్రి మిషన్. ఇది భూ కక్ష్య లోకి రెండు సైంటిఫిక్ పేలోడ్ లను మోసుకెళ్లనుంది.