TRINETHRAM NEWS

రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు…

  • గవర్నర్, పలువురు మంత్రులు
    హైదరాబాద్
    రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నూతన సంవత్సరం (2024) శుభాకాంక్షలు తెలిపారు. సీఎం రేవంత్రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి , సీతక్క, తుమ్మల, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, జూపల్లి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

వీరితో పాటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్రావు, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని, బీఎస్పీ అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాది.. కొత్త ఆశలు.. కొత్త కోరికలు.. కొత్త లక్ష్యాలు.. కొత్త ఆశయాలు.. కొత్త నిర్ణయాలు.. కొత్త వేడుకలు.. కొత్త ఉత్సాహం మీతో కలకాలం ఉండాలని వేర్వేరు ప్రకటనలో ఆకాంక్షించారు. 2024లో ఇంటింటా ఆనందాలు, ప్రతీ కుటుంబంలో అభివద్ధి కాంతులు వెల్లి విరియాలనీ, రాష్ట్రంలోని అన్ని సామాజిక తరగతులు, వర్గాలు సుస్థిరమైన అభివృద్ధి పథంలో ప్రయాణిస్తుందనీ, ప్రయాణించాలని ఆకాంక్షించారు.