TRINETHRAM NEWS

Former minister KTR’s visit to closed catchment areas today

Trinethram News : హైదరాబాద్ : సెప్టెంబర్ 30
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసి డెంట్, మాజీ మంత్రి కేటీఆర్, 72 గంటల తర్వాత జ్వరం తగ్గినట్లు ఆయన ఆదివారం సాయంత్రం వెల్లడించారు. దీంతో ఇవ్వాళ ప్రజల్లోకి వెళ్లనున్నారు.

నేడు మూసీ పరివాహక ప్రాంత బాధితుల దగ్గరకు వెళ్లనున్నట్లు ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని హైదర్ గూడలో కేటీఆర్ పర్యటిస్తా రని,సమాచారం..

అనంతరం అత్తాపూర్ లోని కిషన్ బాగ్ ప్రాంతాల్లోని ప్రజలతో కేటీఆర్ భేటీ కానున్నారు.ఇక అటు బావమరిది తో లీగల్ నోటీసు పంపితే నీ ఇల్లీగల్ దందాల గురించి మాట్లా డుడు బంద్ చేస్తా అనుకుం టున్నావా ? అంటూ రేవంత్‌ పై ఆగ్రహించారు కేటీఆర్‌.

బావమరిదికి అమృతం పంచి, పేదలకు విషం ఇస్తుంటే చూస్తూ ఊరుకో బోమని హెచ్చరించారు. పేదలకు సాధ్యమైనంత వరకు న్యాయం చేస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Former minister KTR's visit to closed catchment areas today