TRINETHRAM NEWS

అతివేగం, నిద్రమత్తు ఐదు ప్రాణాలను చిదిమేసింది.

మృతుల్లో ఓ చిన్నారి ఉండడం మరో విషాదం. బళ్లారి నుంచి హైదరాబాద్‌ వస్తున్న ఓ కారు.. ఈ తెల్లవారుజామున అదుపుతప్పి ఓ చెట్టును ఢీకొట్టింది.

దీంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడిక్కడే మరణించగా..మరో చిన్నారి ఆస్పత్రికి తరలిస్తుండగా తుదిశ్వాస విడిచింది.

వనపర్తి జిల్లా కొత్తకోట బైపాస్‌లో జరిగింది ఈ దుర్ఘటన. ప్రమాదం జరిగిన సమయంలో కారులో 9 మంది ప్రయాణిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రమాదంలో మొత్తం ఐదుగురు మృతి చెందగా..మరో నలుగురు తీవ్ర గాయాలతో వనపర్తి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదానికి అతివేగంతో పాటు కారు డ్రైవర్‌ నిద్రమత్తే కారణమని తెలుస్తోంది. ప్రమాదానికి గురైన కారు కర్నాటకలో రిజిస్టర్ అయింది.