TRINETHRAM NEWS

Financial assistance to helpless old women

గోదావరిఖని బృందావని కాలనీకి చెందిన , సుగుణ నిస్సహాయ వృద్ధురాలకు వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ,

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

బొజ్జ సురేందర్ దంపతుల కుమారుడు బొజ్జ అరుణ్ జన్మదిన సందర్భంగా గురువారం వృద్ధురాలకు. చిన్న సహస్ర చేతుల మీదుగా 25 కేజీల బియ్యం అందించడం జరిగింది. అనంతరం వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ ఫౌండర్ అండ్ చైర్మన్ లయన్, డాక్టర్ సురభి శ్రీధర్ మాట్లాడారు.అరుణ్ జన్మదిన సందర్భంగా నిస్సహాయులకు సహాయం చేయాలని ఆలోచన బొజ్జ సురేంద్ర కుటుంబ సభ్యులకు రావడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ప్రతి ఒక్కరు తమకు సంబంధించిన శుభకార్యాలు జరిగినప్పుడు నిస్సహాయులకు, నిర్భాగ్యులకు తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో చందనాల రాజేష్,మేకల శివ తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Financial assistance to helpless old women