దేవరకొండ డివిజన్ జనవరి.22 త్రినేత్రం న్యూస్. అద్దె భవనాల భారం తగ్గించుకోవాలన్నా ప్రభుత్వ ఆదేశాలతో దేవరకొండ పట్టణంలో కార్యాలయాల తరలింపు వేగ వంతమైంది. ఇన్స్పెక్షన్ బంగ్లా (ఐ బి) వద్ద ఉన్న పాత గృహ నిర్మాణ శాఖ భవనంలోకి ఎక్సైజ్ కార్యాలయాన్ని మారుస్తూ అధికారులు సామాగ్రిని తరలిస్తున్నారు.
అటు సబ్ రిజిస్టర్ కార్యాలయం ఐబి సెంటర్ కి మారబోతోంది. జనవరి లోపు సొంత భవనాలలో కి వెళ్లాలని ఉత్తర్వులు రావడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఇకపై అన్ని ప్రభుత్వ సేవలు ఒకే చోట అందుబాటులోకి రానున్నాయి. దీనితో నియోజకవర్గ ప్రజలు అటు ఇటు తిరగకుండా ఒకే చోట జరగబోతుండడంతో పలువురు ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


