
తేదీ : 06/03/2025. కుక్కునూరు మండలం: (త్రినేత్రం న్యూస్); విలేఖరి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , పోలవరం నియోజకవర్గం, కుక్కునూరు మండలం లో సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ , అవుట్సో ర్సింగ్ ఉద్యోగుల సమ్మె నాటి ఒప్పందాలు అమలు చేయాలి. హెచ్ ఆర్ పాలసీ , మినిమం సమయం స్కేల్ సమ్మె కాలపు ఒప్పందాలు, గ్రాడ్యుటీ పదవి విరమణ వయసు 62 సంవత్సరాలుగాను , ఇతర సమస్యలపై మండల విద్యాశాఖ కార్యాలయం వద్ద కేజీబీవీ పాఠశాలలో విరామం సమయంలో జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు నిరసనలు తెలపడం జరిగింది.
అదేవిధంగా గత ప్రభుత్వం వైసీపీ ఆయంలో హామీలు ఇచ్చి వాటిని నిలబెట్టలేదని అందుకే మరో మారు, ఆందోళనలు చేపట్టారు.ఈ కార్యక్రమంలో ఆఫీస్ సిబ్బంది, పోతురాజు, లావణ్య , కుక్కునూరు, వెలేరు కేజీబీవీ ప్రత్యేక అధికారులు సుశీల, సునీత, రెండు పాఠశాలల టీచింగ్ నాన్ టీచింగ్, పార్ట్ టైం ఇన్స్పెక్టర్లు వెంకన్న బాబు, బి. ఖాసిం ప్రమీల పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
