TRINETHRAM NEWS

Mar 29, 2024,

31లోగా ఇవి పూర్తి చేయండి..
ఆదాయపు పన్ను రిటర్నులకు సంబంధించి, అప్‌డేటెడ్ రిటర్నులు దాఖలు చేయడానికి మార్చి 31 వరకూ గడువుంది. ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసు వచ్చిన వారు ఈ పనిని పూర్తి చేయాలి. వీటిని దాఖలు చేసేటప్పుడు అదనంగా చెల్లించాల్సిన పన్నుపై కొంత వడ్డీ చెల్లించాల్సి రావచ్చు. బ్యాంకుల్లోనూ ఆధార్, పాన్ కార్డులాంటివి లేకపోతే కేవైసీని అప్‌డేట్ చేసుకోవాలి.