TRINETHRAM NEWS

Trinethram News : అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి(Chief Minister YS Jaganmohan Reddy) బుధవారం భీమవరంలో పర్యటించనున్నారు. కాళ్ళ మండలం పెదఅమిరంలోని రాధాకృష్ణ కన్వెన్షన్ లో వైసీపీ నేత గుణ్ణం నాగబాబు కుమారుడి వివాహానికి హాజరుకానున్నారు..

మధ్యాహ్నం 2.10 కి తాడేపల్లి నుండి బయలుదేరి 2.40 కి పెదఅమిరం చేరుకుంటారు. అనంతరం 2.53 కు కళ్యాణమండపంకు చేరుకుని వధూవరులను ఆశీర్వదించనున్నారు. అనంతరం 3.20 కు హెలికాప్టర్ లో బయలుదేరి విశాఖపట్నం చేరుకుంటారు..