TRINETHRAM NEWS

నేడు పలమనేరు నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజాగళం పర్యటన మొదలు పెట్టనున్నారు. ఇవాళ పలమనేరు తో పాటు పుత్తూరు, మదనపల్లెలో పర్యటిస్తారు.

రేపు రాప్తాడు, శింగనమల, కదిరిలో పర్యటిస్తారు.

శుక్రవారం శ్రీశైలం, నందికొట్కూరు, కర్నూలులో ప్రచారం నిర్వహిస్తారు.

ఈ నెల 30న మైదుకూరు, ప్రొద్దుటూరు, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తిలో పర్యటిస్తారు.

31న కావలి, మార్కాపురం, సంతనూతలపాడు, ఒంగోలులో చంద్రబాబు పర్యటించనున్నారు.