BJP Conducts Training Classes : మండల స్థాయి శిక్షణ తరగతులు నిర్వహించిన బిజెపి

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ గంగాధర నెల్లూరు నియోజకవర్గ ఇన్చార్జ్ … బీజేపీ పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియాన్ కార్యక్రమంలో భాగంగా మండలస్థాయి శిక్షణా తరగతులను శనివారం పెనుమూరు లోని ముత్యాలమ్మగుడి ఆవరణలో బీజేపీ మండలాద్యక్షురాలు గుత్తా ఉషారాణి ఆద్వర్యంలో నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చిత్తూరు జిల్లాలోని బి జె పి నాయకులు పాల్గొని, శిక్షణలో భాగంగా వారికి కేటాయించిన కాలాంశాన్ని గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లాఅద్యక్షుడు జగదీష్ నాయుడు, ఉపాధ్యక్షుడు జీకేచౌదరి, జిల్లాప్రశిక్షణా ప్రముఖ్ చిట్టిబాబు,
ఉమ్మడిజిల్లా మాజీ అద్యక్షుడు గుత్తానారాయణస్వామి, రాష్ట్ర ఎస్సీకార్పొరేషన్ డైరెక్టర్ బాబు, చిత్తూరు జిల్లా మీడియా ఇంచార్జి రాంభద్రం, బీజేపీ పెనుమూరు మండల ప్రధానకార్యదర్శులు పరంధామయ్య, మాజీ మండలాద్యక్షుడు వాసుదేవనాయుడు, నాయకులు రామ్మూర్తిరెడ్డి, శివయ్యనాయుడు, కిషోర్, రాజలక్ష్మి, కృష్ణమ్మ, లత, చంద్రశేఖర్, దొరస్వామి, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

BJP conducts mandal level training classes

You cannot copy content of this page

Scroll to Top