తేదీ : 15/07/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్ );ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, జిల్లా కేంద్రమైన భీమవరం మెంటే వాళ్ల తోటలోని శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అమ్మవారి కి నూట ఎనభై కేజీలతో ఆషాడ మాస సారే అందించడం జరిగింది. తోటకూర. కృష్ణ, ఫణిలక్ష్మి దంపతుల సహకారంతో ఆలయ అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. ముందుగా నూట ఎనిమిది మంది మహిళల చే ఆలయ ప్రాంగణం నుంచి మెంటే వాళ్ల తోటలో ఊరేగింపు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.


