TRINETHRAM NEWS

ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కామెంట్స్..

చరిత్రలో ఎప్పుడు లేనివిధంగా మానిఫెస్టోను పవిత్రంగా భావించింది వైసీపీ, వైఎస్ జగన్ మాత్రమేనని అన్నారు మంత్రి బుగ్గన.

సంతృప్త స్థాయిలో మానిఫెస్టోను అమలు చేయడం ఒక బెంచ్ మార్క్ అని కొనియాడారు.

జగన్ విధానాలు ఎన్నో రాజకీయ పార్టీలకు బెంచ్ మార్క్ అయ్యాయని ప్రశంసించారు.

అట్టడుగున ఉండే బడుగు, బలహీనవర్గాలకు ప్రాధాన్యం ఇచ్చామని తెలిపారు.

విద్య, వైద్యం, మహిళ సాధికారిత, వృద్ధులకు ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు.

ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్నట్టు కాకుండా మౌలిక వసతులు కల్పిస్తున్నామని పేర్కొన్నారు.

విభజన హామీలు చాలావరకు ఎన్నో సాధించుకొగలిగాం. కచ్చితంగా సంక్షేమానికే పెద్ద పీట ఉంటుందని మంత్రి బుగ్గన స్పష్టం చేశారు.