TRINETHRAM NEWS

రాష్ట్రంలో మరో సంచలన సర్వే విడుదల…

వైసిపి 34, టిడిపి – జనసేన 141….

ఏపీలో మరో సంచలన సర్వే వెల్లడైంది. ఎన్నికల సమీపిస్తున్న కొలది సర్వేలు హల్ చల్ చేస్తున్నాయి…

ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు కాండ్రేగుల ప్రసాద్ తాజాగా ఓ సర్వేను వెల్లడించారు. తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు నేపథ్యంలో.. ఏ పార్టీ విజేతగా నిలవనున్నది అన్నది నియోజకవర్గాల వారీగా ఫలితాలను వెల్లడించారు…

ఈసారి వైసిపి గణనీయమైన సీట్లు పోగొట్టుకోనుంది. 34 స్థానాలకే పరిమితం కానుందని స్పష్టమైంది…

తెలుగుదేశం,జనసేనకూటమి 141 స్థానాల్లో ఘన విజయం సాధించనుందని సర్వే తేల్చడం విశేషం. కూటమి స్పష్టమైన మెజారిటీ దిశగా దూసుకెళ్తోంది…