
Trinethram News : నాగర్ కర్నూలు జిల్లాలోని నల్లమల అడవిలో కార్చిచ్చు రేగింది. దీంతో దోమలపెంట, కొల్లంపెంట, కొమ్మనపెంట, పల్లెబైలు, నక్కర్లపెంట ప్రాంతాల్లో మంటలు చెలరేగాయి. మంటలార్పేందుకు అటవీశాఖ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే 50హెక్టార్ల విస్తీర్ణంలో అడవి దగ్ధమైనట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
