
దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్
Ramavat Ravindra Kumar : దేవరకొండ డివిజన్ మే 14, త్రినేత్రం న్యూస్. దేవరకొండ మండలం గన్యానాయక్ తండాలో శ్రీశ్రీశ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం కార్యక్రమంలో మాజీ శాసన సభ్యులు రవీంద్ర కుమార్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ……ప్రతి ఒక్కరూ భక్తి భావాన్ని పెంపొందించుకోవాలి అని ఆయన అన్నారు.దైవచింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుంది అని అయన తెలిపారు.ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలి అని అయన అన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ ని ఆలయ కమిటీ సభ్యులు సన్మానించారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నేనావత్ కిషన్ నాయక్,బిఆర్ఎస్ మాజీ మండల పార్టీ అధ్యక్షులు TVN రెడ్డి, స్థానిక సర్పంచ్ నేనావత్ గోపాల్ నాయక్, రామావత్ తులిసీరామ్,బొడ్డుపల్లి కృష్ణ, నేనావత్ నగేష్,తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe

