Illegal Arrest : సంత వేలంలో రైతుల పక్షాన అధికారులకు నిలదీయగా అక్రమ అరెస్టు

TRINETHRAM NEWS
Illegal arrest while protesting

జనసేన పార్టీ సీనియర్ నాయకులు :– కొర్ర చందు నాయక్, కొత్తగొల్ల నరేష్.

Illegal Arrest : కొండ మల్లేపల్లి మార్చ్ 25, త్రినేత్రం న్యూస్. జనసేన నాయకులు కొర్ర చదునాయక్ మాట్లాడుతూ కొండ మల్లేపల్లి సంత వేలం 2015 నుంచి 2025 వరకు 50 లక్షలకే వేలం దక్కించుకునేది కానీ 2026 సంత వేలం పాట మూడు కోట్ల 80 లక్షలు దాటడంలో సందేహం అతిపెద్ద సంత అయినా రెండవ సంత వేలం పాట కొండమల్లేపల్లి మండల కార్యదర్శి సర్పంచ్ వార్డు మెంబర్ల, మరియు అధికారుల ఆధ్వర్యంలో వేలంపాట నిర్వహించడం జరిగింది.

ఈ వేలం పాటలో సుధాకర్ రెడ్డి కల్వకుర్తి మూడు కోట్ల 80 లక్షల,ఒకవేయి రూపాయల కు వేలంలో పాల్గొని దక్కించుకోవడం జరిగింది . ఈ సందర్భంగా జనసేన పార్టీ సీనియర్ నాయకులు కొర్ర చందు నాయక్ మాట్లాడుతూ.. రైతులకు జరగాల్సిన న్యాయం జరగకపోవడంతో జనసేన పార్టీ రైతులు పడుతున్న గోసను రైతుల పక్షన అధికారులకు నిలదీయగానే కొండమల్లేపల్లి పోలీస్ అధికారులు జనసేన పార్టీ నాయకులు పోలీస్ అధికారులకు ఇదెక్కడి దౌర్జన్యం అడగగా అధికారులు వాళ్ళ ఇష్టానుసారంగా లాక్కెల్లి పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది.

రైతుల పక్షాన మాట్లాడినందుకు పోలీస్ అధికారులు ఇంతదారుణంగా వ్యవహరించడం న్యాయమా గత 15 సంవత్సరాల నుంచి వేలం జరగకుండా ప్రభుత్వానికి రావాల్సిన డబ్బు రానివ్వకుండా మధ్యలో అధికారులు కుమ్మకై ప్రభుత్వం ఆదాయానికి గండి కొట్టడం జరిగిందిఅనిఅన్నారు ప్రభుత్వానికి రావాల్సిన సొమ్ముని రాబట్టి ఇప్పుడు జరిగిన వేలంలో రైతులకు న్యాయం జరగాలి 100కు ₹5 కాకుండా 100కు రూపాయి చిట్టి ఇవ్వాలి రైతులకు షెడ్డు వాటర్ ఐదు రూపాయల భోజనం రైతుల దగ్గర ఉన్న నగదుకి రక్షణ, ఆవు కుగాని మేక పోయిన వేలం దక్కించుకున్న వారు రైతులకు ఆదుకోవాలి లేనియెడల సంత జరగనివ్వకుండా రైతుల పక్షాన ప్రతి సంతకు జనసేన పార్టీ ధర్నా నిరసన తెలుపుతుందని చందు నాయక్ పేర్కొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news

You cannot copy content of this page

Scroll to Top