Urea Available : రైతులకు అందుబాటులో యూరియా

TRINETHRAM NEWS

డిండి, (గుండ్ల పల్లి)జనవరి 21త్రినేత్రం న్యూస్. డిండి మండలంలో రైతాంగానికి యాసింగి సీజన్ లో సరిపోయే యూరియా నిలువలు అందుబాటులో ఉంటున్నాయని, డిండి మండల వ్యవసాయ అధికారి రెహానా బుధవారం ఒకప్రకటనలో తెలిపారు.

రైతులు తమ రైతు పాస్ బుక్ నెంబర్ తో, ఫోన్ నెంబర్ లింకుతో యూరియాలో ఆన్లైన్లో బుక్ చేసుకోవాలని ఆమె తెలిపారు.

మండలంలోని నాలుగు కేంద్రాలైన పిఎసిఎస్ డిండి, పిఎసిఎస్ త వకలాపూర్, ఫార్ మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్, మరియు ఆగ్రో రైతు సేవ కేంద్రంలో యూరియా నిల్వ లు అందుబాటులో ఉంటాయని, రైతులు బుక్ చేసుకున్న యూరియా 24 గంటల పాటు ఆన్లైన్లో ఉంటుందని, తద్వారా రైతులు కేంద్రాల నుండి యూరియాను తీసుకోవచ్చని ఆమె తెలియజేశారు. ఆమె వెంట డిండి క్లస్టర్ ఏ ఈ ఓ వెంకటేష్, కందుకూరు క్లస్టర్ ఏ ఈ ఓ తేజ ఉన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Urea available to farmers

You cannot copy content of this page

Scroll to Top