త్రినేత్రం న్యూస్ అశ్వారావుపేట.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జారే ఆదినారాయణ భోగి, పండుగ సందర్భంగా అశ్వారావుపేట నియోజకవర్గ ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భోగి పండుగ ప్రతి ఇంటా ఆనందం, ఆశ, ఐక్యతకు ప్రతీకగా నిలవాలని ఆకాంక్షించారు.
పంటలు పండే ఈ శుభ సందర్భంలో రైతాంగానికి మంచి దిగుబడులు, వ్యవసాయ రంగంలో మరింత అభివృద్ధి కలగాలని, రైతు కుటుంబాలు ఆర్థికంగా బలపడాలని కోరుకున్నారు.అలాగే యువత విద్య, ఉద్యోగాల్లో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో నిలవాలని, పిల్లలు ఆరోగ్యంగా, సుఖసంతోషాలతో ఎదగాలని.
ఆశాభావం వ్యక్తం చేశారు. భోగి పండుగ ద్వారా ప్రతి కుటుంబంలో శాంతి, సౌఖ్యం, ఐశ్వర్యం వెల్లివిరియాలని ఆకాంక్షించారు.ప్రజల ఆశీస్సులు, కాంగ్రెస్ పార్టీ నాయకుల సహకారంతో అశ్వారావుపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు తాను ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటానని అన్నారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా నిరంతరం కృషి చేస్తామని, ప్రజా సమస్యల పరిష్కారానికి తన కార్యాలయం ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని హామీ ఇచ్చారు. భోగి పండుగ సందర్భంగా ప్రజలందరూ సుఖసంతోషాలతో, కుటుంబ సభ్యులతో ఆనందంగా పండుగ జరుపుకోవాలని కోరుతూ, మరోసారి అశ్వారావుపేట నియోజకవర్గ ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు భోగి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


