Minister N.M.D. Farooq : డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించిన మంత్రి ఎన్.ఎండి. ఫరూక్

TRINETHRAM NEWS

అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: మంత్రి ఫరూక్

నంద్యాల (6 డిసెంబర్ 2025). నంద్యాల: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్.ఎండి. ఫరూక్ శనివారం నంద్యాలలోని తన క్యాంప్ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్.ఎండి. ఫరూక్ మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అందరికీ సమాన విద్య, ఆరోగ్యం, ఉపాధి, రక్షణ, నివాసం, భావ ప్రకటనకు సమ న్యాయం రాజ్యాంగంలో పొందుపరిచిన భారత పిత అని కొనియాడారు. సమ సమాజ నిర్మాణంలో బాబాసాహెబ్ చేసిన కృషికి గుర్తింపుగా ప్రపంచ దేశాలు, ఐక్యరాజ్య సమితి సైతం ఆయన్ను “సింబల్ ఆఫ్ నాలెడ్జ్”గా గుర్తించాయని తెలిపారు. అంబేద్కర్ ఆశయాలు, సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లడానికి తమ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి ఫరూక్ తెలిపారు . అలాగే డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల ప్రజల కొరకు పాటుపడిన కృషిని స్మరిస్తూ. కులాల మతాల మధ్య విభేదాలు లేకుండా మనమంతా ఒకటే ప్రజలంతా ఒకటే అని చాటి చెప్పిన మహనీయుని గురించి తలుచుకుంటూ ఆయన రచించిన రాజ్యాంగం వలన ఈరోజు మనమంతా జీవిస్తున్నామన్నారు. భారతదేశంలోని ప్రజలందరూ ఆత్మగౌరవంతో బ్రతుకుతున్నారంటే అది అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వలన అని గుర్తు చేశారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అంబేడ్కర్ చేసిన కృషి ఎంతో గొప్పదని మంత్రి ఫరూక్ కొనియాడారు.

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు శ్రీదేవి , నాగార్జున , నంద్యాల మార్కెట్ యార్డ్ డైరెక్టర్ సుమలత , జెపి , బ్యాంకు తిమ్మయ్య , మాజీ కౌన్సిలర్ దేవరపాటి రవికుమార్ , కొండారెడ్డి , నంద్యాల మండల టిడిపి కన్వీనర్ మునగాల విశ్వనాథరెడ్డి , కామణి మల్లికార్జున , బింగుమల్ల శ్యామ్ సుందర్ గుప్తా , మిద్దె ఉసేని , త్రిలింగేశ్వర్ రెడ్డి , రంగ ప్రసాద్ , ఓబుల్ రెడ్డి , అలీమ్ తదితరులు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Minister N.M.D. Farooq pays tribute to Dr. B.R. Ambedkar

You cannot copy content of this page

Scroll to Top