త్రినేత్రం న్యూస్ డిసెంబర్ 04 : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, మండపేట, రాజమండ్రి లో జరిగిన రిలయన్స్ క్విజ్ పోటీ 2025 లో మండపేట సర్దార్ వేగుళ్ళ వీర్రాజు మున్సిపల్ హై స్కూల్ విద్యార్థులు జిల్లా ప్రథమ స్థానం కైవసం చేసుకున్నారు. విద్యార్థినిలు యూ.వి.ఎన్.ఎస్ ప్రజ్ఞ, కె.దివ్య ధనలక్ష్మి లకు ఒక్కొక్కరికి రూ 53000 విలువ గల రెండు లాప్టాప్ లను బహుమతులుగా అందజేశారు. శిక్షణ ఇచ్చిన ఉపాధ్యాయుడు, గైడ్ టీచర్ రామచంద్రారెడ్డిని, విద్యార్థినిలను మండపేట మున్సిపల్ చైర్ పర్సన్ పతివాడ నూక దుర్గారాణి, అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు యం.వెంకటేశ్వర రావు, కే గోపాలకృష్ణారెడ్డి, తల్లిదండ్రులు ఉండి చంద్రకళ, పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


