Trinethram News : వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలోని శనిగరంలో అప్పు వివాదం దారుణానికి దారితీసింది. ఇచ్చిన రూ. 40 వేలు అడిగేందుకు వెళ్లిన సముద్రాల బాలరాజుపై బుధవారం ముచ్చింపుల తండాకు చెందిన ఆరుగురు కలిసి దాడి చేశారు. సుజాత-భిక్షపతి దంపతుల ఇంటికి వెళ్లిన బాలరాజును కర్రలతో కొట్టి, సిమెంట్ దిమ్మెకు కట్టేసి తీవ్రంగా గాయపరిచారు. తలకు, శరీరానికి గాయాలైన బాలరాజు ఫిర్యాదు చేయడంతో ఎస్సై గోవర్ధన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe
