వరంగల్ జిల్లా 22 ఆగస్టు: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. దేశాయిపేట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రనీ రాష్ట్ర కుష్టు నివారణ బృందం సందర్శించి ఇక్కడ వైద్య సిబ్బంది ఏఎన్ఎం ఆశా కార్యకర్తలకి అవగాహన కల్పించారు. ఈ కుష్టు వ్యాధిని ప్రాథమిక దశలో గుర్తించి ఏం.డి.టి. మందులను వాడినట్లయితే పూర్తిగా నివారించవచ్చునని పేర్కొన్నారు. కుష్టు వ్యాధి సర్వే పై వారికి అవగాహన కల్పించారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని రికార్డ్ ని పరిశీలించారు, కార్యక్రమంలో రాష్ట్ర బృంద సభ్యులు డిపిఎంఓ వెంకటేశ్వర చారి సకల రెడ్డి శ్రీనివాసరెడ్డి ఏపీఎంఓ అరుణ సుందర్ డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ కొమురయ్య జిల్లా లెప్రసి అధికారి డాక్టర్ మోహన్ సింగ్ డిపిఎమ్ఓ అనుపమ వెంకన్న స్థానిక మెడికల్ ఆఫీసర్ డాక్టర్ టి భరత్ కుమార్ నోడల్ పర్సన్స్ జన్ను కొర్నెల్ మరియు ఆశా కార్యకర్తలు , తదితరులు పాల్గొన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


