డిండి (గుండ్ల పల్లి) ఆగష్టు 09 త్రినేత్రం న్యూస్. డిండి మండల కేంద్రంలోని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థలో నల్గొండ జిల్లా మరియు నాగర్ కర్నూల్ జిల్లా డిండి పరిసర గ్రామీణ ప్రాంత యువతీ యువకులు 18 సంవత్సరాల వయసుగల ఐటిఐ చదువుకున్న నిరుద్యోగుల కొరకు ప్రధానమంత్రి జాతీయ అప్రెంటిస్ మేళా ఈనెల 11వ తేదీన ఉదయం 10:00 నుండి డిండి ప్రభుత్వ ఐటిఐ నందు అప్రెంటిస్ మేళా నిర్వహిస్తున్నామని ప్రిన్సిపాల్ వీరవల్లి రాధాకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ అప్రెంటిస్ నేలలో పలు గుర్తింపు పొందిన కంపెనీలు పాల్గొంటాయి అప్రెంటిస్ మేళాలో ఎంపికైన వారికి అప్రెంటిస్ యాక్ట్ ప్రకారం ఉంటుంది ఈ అప్రెంటిస్ మేళాకు వచ్చే అభ్యర్థులు వారి అప్రెంటిస్ రిజిస్ట్రేషన్ ప్రొఫైల్ మరియు సర్టిఫికెట్ జిరాక్స్ సెట్ తీసుకొని రావాలని వివరాలకు 970 5182 677 నెంబర్ కు సంప్రదించాలని కోరారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


