తేదీ : 09/06/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , చింతలపూడి నియోజకవర్గం, మండలం, యర్ర గుంటపల్లి గ్రామంలో నూతనంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర రైస్ ఇండస్ట్రీ నూతన మిల్లును యం. శ్రీనివాసరావు నిర్మించడం జరిగింది. డైనమిక్ శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్, రిబ్బన్ కట్ చేసి ఆ మిల్లును ప్రారంభించారు.
ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. టిడిపి సీనియర్ నాయకులు, మాజీ ఎంపీపీ, జడ్పిటిసి నాయకురాలు తాళ్లూరి. సుధారాణి, రైస్ మిల్లు మేనేజర్ కుమారులు యం. సాత్విక్, సందీప్, తదితరులు పాల్గొన్నారు. వచ్చిన వాళ్లకు టిఫిన్, మంచినీరు, విందు భోజనాలు, ఎవరికి ఎటువంటి లోటుపాట్లు రాకుండా, లేకుండా చూసుకోవడం జరిగింది. ఈ ప్రాంతంలోని ప్రజలకు , రైతులకు ఈ మిల్లు ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


