త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, ముస్లిం సోదర, సోదరీమణులకు రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగాల పండుగ బక్రీద్ కాగా, త్యాగం, సహనం ఈ రెండూ బక్రీద్ పండగ ఇచ్చే సందేశాలన్నారు. దైవ ప్రవక్త ఇబ్రహీం మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ బక్రీద్ పండుగ జరుపుకుంటారని, త్యాగనిరతికి ఈ పండుగ నిదర్శనమన్నారు. ధనిక, పేద అనే తారతమ్యం లేకుండా రాగద్వేషాలకు అతీతంగా ముస్లింలందరూ ఈ పండుగను భక్తిశ్రద్దలతో చేసుకుంటారన్నారు. అల్లాహ్ ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలందరికీ ఎల్లప్పుడూ ఉండాలని ఎమ్మెల్యే కోరుకుంటున్నట్లు చెప్పారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


