త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, తూర్పుగోదావరి జిల్లా, రాజానగరం మండలం పుణ్యక్షేత్రం గ్రామంలో ఘనంగా నిర్వహించిన శ్రీ అభయాంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్టా మహోత్సవంలో భాగంగా,రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ, పాల్గొని ఆలయంలో స్వామి వారిని దర్శించుకుని, పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ,కి ఘన స్వాగతం పలికి, పూలమాలలతో సత్కరించిన ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు.
స్వామి వారి విగ్రహ నిర్మాణం వంటి మహత్కర కార్యాన్ని తలపెట్టి దిగ్విజయంగా పూర్తి చేసిన దాతలు వేపకాయల సాయిబాబు, శ్రీమతి సూర్య కుమారి, దంపతులను, వీరి కుమారుడు వెంకటరమణ, ను ఘనంగా సత్కరించిన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ..
ఈ కార్యక్రమంలో జనసేన తెలుగుదేశం బిజెపి పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, భక్తులు పాల్గొన్నారు..
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


