తేదీ : 31/05/2025. కృష్ణాజిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సంబంధిత అర్హులైన పింఛన్ లబ్ధిదారులకు విజయవాడ రూరల్ మండలం, అంబాపురం గ్రామంలో లబ్ధిదారుల వద్దకు వెళ్లి వితంతు, వృద్ధాప్య, వికలాంగ పించస్ ల ను అందించడం జరిగింది.
ఈ సందర్భంగా లబ్ధిదారుల యోగక్షేమాలు, స్థానిక సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆయన వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జూన్ ఒకటవ తేదీ ఆదివారం రావడంతో ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ చేసిన ఘనత తమ ప్రభుత్వానికి దక్కిందన్నారు. నియోజకవర్గంలోని అర్హులైన లబ్ధిదారులందరికీ మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


