నేనావత్ బాలు నాయక్
దేవరకొండ మే 12 త్రినేత్రం న్యూస్. దేవరకొండ పట్టణ కేంద్రంలో శ్రీ మార్కండేయ స్వామి ఆలయంలో నిర్వహించిన స్వామి వారి ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొని, స్వామి వారిని దర్శించుకోని,వేద పండితుల మంత్రోచ్ఛారణ నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించిన దేవరకొండ శాసన సభ్యులు నేనావత్ బాలు నాయక్ అనంతరం ఎమ్మెల్యే ని ఆలయ కమిటీ సభ్యులు శాలువాతో సత్కరించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ:- దేవరకొండ నియోజక వర్గ ప్రాంత ప్రజలంతా సుఖశాంతులతో పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని ప్రార్ధించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో నల్గొండ పార్లమెంట్ కోఆర్డినేటర్ సిరాజ్ ఖాన్,మాజీ మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహా, వడ్త్య దేవేందర్ నాయక్, సిపిఐ రాష్ట్ర నాయకులు పల్లా నర్సింహా రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ శిరందాసు కృష్ణయ్య,పట్టణ మాజీ సర్పంచ్ పున్న వేంకటేశ్వర్లు, ప్రజా ప్రతినిధులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


