Army Vehicle : 700 అడుగుల లోయలో పడ్డ ఆర్మీ వాహనం

TRINETHRAM NEWS

ముగ్గురు జవాన్లు మృతి

Trinethram News : మే 04 : జమ్మూ కాశ్మీర్‌లోని రాంభన్ జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్మీ జవానుల తో వెళ్తున్న ఆర్మీ వాహనం 700 అడుగుల లోయలో పడిపోయింది,ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు అక్కడి కక్కడే మృతి చెందారు. పలువురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు.

ఈ ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న ఆర్మీ అధికారులు హుటా హుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.దాదాపు 700 అడుగుల లోయలో ఈ ఆర్మీ వాహనం పడిపోయింది.

జమ్మూ నుంచి శ్రీనగర్‌కు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుందని ఆర్మీ ఉన్నతాధికారులు వెల్లడించారు. ఇక ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతోన్నా యి. ఈ సహాయక చర్యల్లో ఆర్మీ అధికారులు, కాశ్మీర్ పోలీసులు, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్‌తోపాటు స్థానిక వాలంటీర్లు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Army vehicle falls into

You cannot copy content of this page

Scroll to Top