Trinethram News : అమరావతి : ఏపీలో సముద్ర తీరప్రాంతంలో చేపల వేటను నిషేధిస్తూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మత్స్యవనరుల పరిరక్షణలో భాగంగా.. ఏప్రిల్ 15 నుంచి జూన్ 14వ తేదీ వరకు మొత్తం 61రోజులపాటు సముద్ర తీరంలో చేపల వేటపై నిషేధం విధిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. సంప్రదాయ నాటు పడవలు మినహా మెకనైజ్డ్, మోటరైజ్డ్ పడవలు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని పేర్కొంటూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


