WhatsApp Image 2024 01 08 at 10.42.09 AM
Trinethram News : తెలుగు రాష్ట్రాల్లో 1301 కోట్లు పన్ను ఎగవేత
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి జీఎస్టీ బోర్డ్ ఇటీవల స్పెషల్ డ్రైవ్ నిర్వహించగా భారీ పన్ను ఎగవేత కేసులు బయట పడ్డాయి. తెలుగు రాష్ట్రాల్లో 1301 కోట్ల పన్ను ఎగవేతను గుర్తించాయి.
ఏపీలో 19 బోగస్ సంస్థలు 765 కోట్లు, తెలంగాణలో 117 బోగస్ కంపెనీలు 536 కోట్ల స్కాం చేశాయని తేలింది.
తెలంగాణలో 235 కోట్ల మేరకు రికవరీ చేసి ఒకరిని అరెస్ట్ చేసినట్లు ఆర్ధిక శాఖ వర్గాలు వెల్లడించాయి.
