TRINETHRAM NEWS

ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రజలు…

ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులు, ప్రజలు, పార్టీ శ్రేణులు ఈరోజు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా పూల బొకేలు అందజేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అదే విదంగా సమస్యలను పరిష్కరించాలని పలువురు ఎమ్మెల్సీ ని కోరగా సానుకూలంగా స్పందించారు.