TRINETHRAM NEWS

Chigullapally Manjula Ramesh, Municipal Chairperson of Vikarabad, participated in the cleanliness rally held in 24th ward.

తెలంగాణ ప్రభుత్వం, శాసనసభాపతి మరియు వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ ఆదేశాల మేరకు స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా రెండో రోజైన ఈరోజు.. వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని 24వ వార్డులో స్థానిక కౌన్సిలర్ శ్రీదేవి సదానంద్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన స్వచ్ఛత ర్యాలీ కార్యక్రమానికి వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ… స్వచ్ఛతపై ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందని, 2వ రోజు పట్టణంలోని మంచినీటి వాటర్ ట్యాంకులు క్లీన్ చేయడం, మంచినీటిని టెస్టులు చేయడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా కాలనీ వాసులకు కౌన్సిలర్ శ్రీదేవి సదానంద్ రెడ్డి కల్పిస్తున్న అవగాహన తీరును చైర్ పర్సన్ అభినందించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జాకీర్ అహ్మద్, వికారాబాద్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చిగుళ్లపల్లి రమేష్ కుమార్, నాయకులు సదానంద్ రెడ్డి, సామ ప్రభాకర్ రెడ్డి, మున్సిపల్ సిబ్బంది, వివిధ స్కూళ్ల విద్యార్థులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Chigullapally Manjula Ramesh, Municipal Chairperson of Vikarabad, participated in the cleanliness rally held in 24th ward.