WhatsApp Image 2024 04 03 at 10.36.41 AM
Trinethram News : అమరావతి: సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా తెదేపా అధినేత చంద్రబాబు చేపట్టిన ప్రజాగళం పర్యటనలకు రెండో విడత షెడ్యూల్ ఖరారైంది. బుధవారం నుంచి ఐదు రోజుల పాటు ఆయన పలు జిల్లాల్లో పర్యటించనున్నారు.
ఏప్రిల్ 3న కొత్తపేట, రామచంద్రాపురం…
4న కొవ్వూరు, గోపాలపురంలో రోడ్షోలో పాల్గొంటారు…
5న నరసాపురం, పాలకొల్లు…
6న పెదకూరపాడు, సత్తెనపల్లి,
7న పామర్రు, పెనమలూరులో ప్రజాగళం కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ప్రతి రోజు సాయంత్రం 4గంటలకు తొలి సమావేశం, 6గంటలకు రెండో సమావేశం నిర్వహించేలా ప్రణాళిక రూపొందించారు. తొలివిడతలో 15 నియోజకవర్గాల్లో ప్రజాగళం రోడ్ షోల్లో చంద్రబాబు పాల్గొన్నారు.
