WhatsApp Image 2024 03 17 at 15.35.36
Trinethram News : Mar 17, 2024,
బీఆర్ఎస్ ను వీడిన ఐదుగురు సిట్టింగ్ ఎంపీలు
తెలంగాణలో 2019 లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున గెలుపొందిన ఐదుగురు ఎంపీలు ఆ పార్టీని వీడారు. తాజాగా చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి కూడా బీఆర్ఎస్ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన కంటే ముందు.. జహీరాబాద్, నాగర్ కర్నూలు ఎంపీలు బీబీ పాటిల్, రాములు బీజేపీలో, పెద్దపల్లి, వరంగల్ ఎంపీలు వెంకటేశ్ నేత, పసునూరి దయాకర్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.. దీంతో బీఆర్ఎస్ కు ప్రస్తుతం నలుగురు ఎంపీలు మాత్రమే ఉన్నారు.
