పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చెయ్యనంటున్న మల్లికార్జున ఖర్గే

TRINETHRAM NEWS

Trinethram News : న్యూఢిల్లీ :మార్చి 12
కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బరిలోకి దిగే అవకాశం లేదని ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

ఈ ఎన్నికల్లో ఖర్గే పోటీ చేయకుండా.. ఆ పార్టీని ముందుండి నడిపించాలని, ఈసారి ఎట్టిపరిస్థితుల్లోనూ బిజెపితో తలపడేలా పార్టీని అన్నివిధాలా సన్నద్ధం చేసి ఎక్కువ మంది అభ్యర్థు లను గెలిపించేందుకు ఖర్గే కృషి చేయాలని సీనియర్‌ నేతలు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.

సీనియర్‌ నేతల అభిప్రా యం మేరకు ఆయన లోక్‌సభ ఎలక్షన్స్‌లో పోటీకి దిగడం లేదని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. తాజాగా కర్ణాటక గుల్బార్గా నియోజ కవరగం నుంచి ఖర్గే పోటీ చేయాలని ఆ పార్టీ వర్గాలు భావించాయి.

ఆయన పేరును కర్ణాటక సీనియర్‌ నేతలంతా గత వారం ఏకగ్రీవంగా ఆమోదిం చారు. కానీ ఖర్గే మాత్రం ఆయన అల్లుడు రాధాకృష్ణ ను ఆ స్థానం నుంచి నిలబెట్టే అవకాశం ఉంది.

ఆయన పేరును నామినేట్‌ చేసే అవకాశమున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు మీడియాకు తెలిపాయి.

You cannot copy content of this page

Scroll to Top