27న ఛలో విజయవాడ

TRINETHRAM NEWS

Trinethram News : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నెల 27న ‘ఛలో విజయవాడ’ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఏపీ జేఏసీ ఛైర్మన్ బండి శ్రీనివాసరావు తెలిపారు.
దీనికి ఉద్యోగులంతా తరలి రావాలని పిలుపునిచ్చారు.

ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించకపోతే ఆ రోజు ఉద్యోగుల విశ్వరూపం చూస్తారని ఆయన హెచ్చరించారు.

12వ పీఆర్సీ కమిషన్ ఏర్పాటు, ఇతర సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వ పెద్దలు ఏర్పాటు చేస్తున్న సమావేశాలు చాయ్, బిస్కెట్లకే పరిమితం అయ్యాయని దుయ్యబట్టారు.

You cannot copy content of this page

Scroll to Top