
DCP B. Anuradha : హైదరాబాద్ నాగోల్ త్రినేత్రం న్యూస్ ప్రతినిధి : నాగోల్ ఎల్బీనగర్ డీసీపీ బి. అనూరాధ, ఐపీఎస్ నాగోల్ పోలీస్ స్టేషన్ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ రికార్డులు, కేసుల నిర్వహణ, వివిధ విభాగాల పనితీరు, ప్రజలకు అందుతున్న సేవలను పరిశీలించారు.
అనంతరం పోలీస్ సిబ్బందితో సమావేశమై వారి సమస్యలు, విధి నిర్వహణకు సంబంధించిన అంశాలను సమీక్షించారు. సిబ్బంది సంక్షేమం, క్రమశిక్షణ, సమర్థవంతమైన విధి నిర్వహణపై పలు సూచనలు చేశారు. ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన, బాధ్యతాయుతమైన సేవలు అందించేలా అధికారులు, సిబ్బంది కృషి చేయాలని డీసీపీ ఆదేశించారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe