జూలై 14, 2026
TRINETHRAM NEWS
Boy Saves Six Lives

Boy Saves Six Lives : త్రినేత్రం న్యూస్ : Jul 07, 2026, రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్​ డెడ్​ అయిన 7 ఏళ్ల బాలుడి కుటుంబం తీసుకున్న నిర్ణయం ఆరుగురికి ప్రాణం పోసింది. హైదరాబాద్ లోని తిరుమలగిరి యాదమ్మ నగర్‌కు చెందిన లోకినేని రఘు, సౌమ్య పాపారావు కుటుంబం ఉద్యోగరిత్యా తమిళనాడులో ఉంటోంది.

అయితే వీరి కుమారుడు యాశ్వన్(7) జూన్​ 29న సైకిల్​పై రోడ్డు దాటుతుండగా అంబులెన్స్​ అతడిని ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న బాలుడికి జులై 5న బ్రెయిన్​ డెడ్​ అయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ​ కుటుంబం అవయవదానానికి ముందుకు వచ్చింది. యాశ్వన్​ రెండు కిడ్నీలు, కాలేయం, రెండు కార్నియాలు, గుండె కవాటంతో సహా మొత్తం ఆరు అవయవాలను దానం చేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page