TRINETHRAM NEWS

Trinethram News : సంత్ సేవాలాల్ మహారాజ్ 285వ జయంతి సందర్భంగా బంజారా సేవా సంఘం సభ్యులు,కార్పొరేటర్ బాలాజీ నాయక్, మరియు సంఘం సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి వేడుకలో పాల్గొన్న సీనియర్ నాయకులు శ్రీ కోలన్ గోపాల్ రెడ్డి. ఈ సందర్భంగా సేవాలాల్ మహారాజ్ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ ఆగం పాండు ముదిరాజ్,కార్పొరేటర్ ఏనుగుల శ్రీనివాస్ రెడ్డి,కో ఆప్షన్ సభ్యులు సయ్యద్ సలీం, సీనియర్ నాయకులు చంద్రగిరి సతీష్,వెంకటేష్,బంజార సేవా సంఘం సభ్యులు,ఇతర ముఖ్యులు తదితరులు పాల్గొన్నారు.