గంగాధర నెల్లూరు నియోజకవర్గంఇంచార్జి. త్రినేత్రం న్యూస్. ఎగువ కమ్మ కండ్రిగ పంచాయతీ., మిట్ట హరిజన వాడ గ్రామం., నిన్నటి మధ్యాహ్నం అడవికి నిప్పు పెట్టడం వల్ల పక్కనే ఆనుకుని ఉన్న షణ్ముగం అనే రైతుకి చెందిన 5 ఎకరాల చెరుకు తోట దగ్ధమైంది.,
కుటుంబం మొత్తం అక్కడే నివాసం ఉండటం వల్ల బట్టలు, 50 కేజీ ల బస్తాలు 100, బెల్లం తయారు చేసే సామాగ్రిలు, మూడు సెల్ ఫోన్లు, రేషన్ కార్డులు,ఆధార్ కార్డులు, బ్యాంక్ పాస్బుక్కులు, పట్టాదారు పాసుపుస్తకాలు మొదలగునవి మంటల్లో కాలిపోయింది. రెవిన్యూ అధికారులు 11,26,000-00 ( 11 లక్షల 26 వేల రూపాయలు) నష్టం వాటిల్లిందని రిపోర్టు తయారు చేశారు
ఈ ప్రదేశాన్ని సందర్శించి, పరిశీలించి … తక్షణసాయంగా బట్టల కొనుగోలుకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఐదు వేల రూపాయలు (5000/-) ఆర్థిక సహాయం అందించి జనసేన పార్టీ జీడీ నెల్లూరు నియోజకవర్గ ఇన్చార్జి మరియు ఏపీ మాల వెల్ఫేర్ కోపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ డాక్టర్ యుగంధర్ పొన్న.
ఈ విషయాన్ని కూటమి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ డాక్టర్ వి.ఎం థామస్ కు చిత్తూరు జిల్లా కలెక్టర్ మరియు డిస్టిక్ మెజిస్ట్రేట్ సుమిత్ కుమార్ దృష్టికి మరియు కూటమి ప్రభుత్వం తరఫున రావలసిన ప్రతి ప్రయోజనం వారికి అందేటట్లు ఈ కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఎస్ ఆర్ పురం మండల అధ్యక్షులు చిరంజీవి, జిల్లా సంయుక్త కార్యదర్శి రాఘవ, నియోజకవర్గ యువజన అధ్యక్షులు సుమన్, జనసైనికులు గ్రామస్తులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


