TRINETHRAM NEWS

రాజకీయాల నుంచి తప్పుకుంటున్న వైసీపీ ఎమ్మెల్యే

వైసీపీ ఎమ్మెల్యే గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ప్రస్తుత రాజకీయాల్లో ఇమడలేక పోతున్నాను.. అందుకే రాజకీయాల్లో నుంచి శాశ్వతంగా తప్పుకుంటున్నట్లు అన్నా రాంబాబు తెలిపారు. అలాగే ఆరోగ్య కారణాల వల్ల కూడా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదని అన్నారు.