TRINETHRAM NEWS

అందరూ చూస్తు ఉండగానే …పెట్రోల్ ట్యాంక్ పేలి 40 మంది మృతి

లైబీరియాలో ఘోర ప్రమాదం జరిగింది.

పెట్రోల్ ట్యాంకర్ పేలి 40 మంది చనిపోయారు.

ట్యాంకర్ నుంచి పెట్రోల్ లీక్ అవుతుండగా.. పట్టుకునేందుకు జనం ఎగబడ్డారు.

ఈ క్రమంలో ఒక్కసారిగా ట్యాంకర్ పేలిపోయింది.

ఈ దుర్ఘటనలో 40 మంది చనిపోగా..
చాలామంది గాయపడ్డారు.

మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.

కాగా, మరోవైపు టొటొటా పట్టణంలో జరిగిన మరో పేలుడులో 88 మంది గాయపడ్డారని లైబీరియా అధికారులు వెల్లడించారు.