TRINETHRAM NEWS

జోగులాంబ అమ్మవారిని మరియు బాల బ్రహ్మేశ్వర స్వామి వారిని దర్శించుకున్నా

అయిజ మండల సింగిల్ విండో మాజీ అధ్యక్షులు సంకాపురం రాముడు గారు

తెలంగాణ రాష్ట్రం లో ఉన్న ఏకైక శక్తి పీఠం శ్రీ జోగుళాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి వారిని మరియు జోగులాంబ అమ్మవారిని అయిజ మండల సింగిల్ విండో మాజీ అధ్యక్షులు సంకాపురం రాముడు గారు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి దర్శనం అనంతరం వేద ఆశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో తోత్తినోని దొడ్డి ఎంపీటీసీ ఉమేష్ గౌడ్, నౌరోజి క్యాంప్ సర్పంచ్ భద్రయ్య , చిన్న తాండ్రపాడు మల్లేష్ మరియు తదితరులు పాల్గొన్నారు.