WhatsApp Image 2024 01 30 at 11.13.29 AM
వంగవీటి రంగా సతీమణికి తీవ్ర అస్వస్థత.
మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహన రంగా భార్య, మాజీ ఎమ్మెల్యే రత్నకుమారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
వెంటనే ఆమెను విజయవాడ లోని హెల్ప్ ఆస్పత్రికి తరలించారు.
అక్కడ వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు.
విషయం తెలిసిన రంగా అభిమానులు భారీ ఎత్తున ఆస్పత్రి వద్దకు చేరుకుంటున్నారు.
మరోవైపు ఎమ్మెల్యేలు కొడాలి నాని, వల్లభనేని వంశీ కూడా ఆస్పత్రికి చేరుకున్నారు.
