TRINETHRAM NEWS

నేడు అయోధ్యకు శ్రీరామ పాదుకలు అయోధ్య రామమందిరంలో ఇవాళ ఒక కీలక ఘట్టం జరగనుంది.

దేశ వ్యాప్తంగా శ్రీరాముడు నడిచిన మార్గాల మీదుగా పూజలందుకున్న పాదుకలు ఇవాళ అయోధ్య కు చేరుకోనున్నాయి.

9KGల బరువున్న ఈ పాదుకల కోసం 8KGల వెండి వాడారు. కిలో బంగారంతో తాపడం చేశారు.

HYDకు చెందిన అయోధ్య భాగ్య నగర సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు చల్లా శ్రీనివాస శాస్త్రి వీటిని తయారు చేయించారు.

జనవరి 22న రాముడి ప్రాణ ప్రతిష్ఠ అనంతరం వీటిని ఆలయంలో ప్రతిష్ఠిస్తారు