TRINETHRAM NEWS

నేడే కాంగ్రెస్ పార్టీ 139వ ఆవిర్భావ దినోత్సవం

హైదరాబాద్:డిసెంబర్ 28
ఇవాళ కాంగ్రెస్ పార్టీ 139వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ఈ క్రమంలోనే మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో భారీ బహిరంగ సభకు పార్టీ అధిష్టానం ఏర్పాట్లు చేసింది..

ఈ సభకు కాంగ్రెస్ అగ్రనేతలు.. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో పాటు ఏఐసీసీ చీఫ్ మల్లిఖార్జున్ ఖర్గే కూడా హాజరు కాబోతున్నారు.

అలాగే పార్టీ సీనియర్ నేతలతో పాటు ఇండియా కూటమి నేతలు సైతం ఈ బహిరంగ సభలో పాల్గొననున్నారు. త్వరలోనే లోక్ సభ ఎన్నికలు వస్తుండటంతో ఏఐసీసీ ఈ సభను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తుంది..