TRINETHRAM NEWS

Thunderstorm in Bihar: 9 people died

Trinethram News : బీహార్ : జులై 06
బీహార్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల పిడుగులు పడ్డాయి. ఈ పిడుగుల కారణంగా గడిచిన 24 గంటల్లో 9 మంది దుర్మరణం పాలయ్యారు.

రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో ఈ ఘటనలు చోటుచేసుకు న్నాయి. వాటిలో జహనా బాద్‌, మాదేపుర, ఈస్ట్‌చం పారన్‌, రోహ్‌తాస్‌, సరాన్‌, సుపౌల్‌ జిల్లాలు ఉన్నాయి.

జహనాబాద్‌ జిల్లాలో ముగ్గురు, మాదేపుర జిల్లాలో ఇద్దరు, ఈస్ట్‌ చంపారన్‌, రోహ్‌తాస్‌, సరాన్‌, సుపౌల్‌ జిల్లాల నుంచి ఒక్కొక్కరు చొప్పున పిడుగుపాట్లకు బల య్యారు. ఘటనపై బీహార్ ముఖ్య మంత్రి నితీశ్‌ కుమార్ తీవ్ర విచారం వ్యక్తంచేశారు.

మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించ నున్నట్లు ప్రకటించారు. ప్రజలు విపత్తు నిర్వహణ విభాగం అధికారుల సూచనలు పాటించాలని సీఎం సూచించారు. ఈ మేరకు సీఎం కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Thunderstorm in Bihar: 9 people died